14-06-2025 12:00:00 AM
అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమంలో డిడబ్ల్యువో జరీనా బేగం
మహబూబ్ నగర్ జూన్ 13 (విజయ క్రాంతి) : తల్లి, బిడ్డల సంక్షేమం కోసం అంగన్వాడి కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయని జిల్లా సంక్షేమ అధికారి జరిన వేగం అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బండ్ల గిరిలో నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో జి ల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం హాజరై మాట్లాడారు.
వయసుకు తగ్గ బిడ్డ ఎదుగుదల ఉండాలని, లేని ఇళ్ల ఇందుకు కారణాలను విశ్లేషించి అవసరమైన పోషకారాన్ని అందించడం జరు గుతుందన్నారు. మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు అంగన్వాడి కేంద్రాలు వైద్య ఆరోగ్య సి బ్బందితో కలిసి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలు తాగించాలని, రోగ నిరోధక శక్తి ముర్రు పాలలో ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా టి హెచ్ ఆర్, హెచ్ సి ఎం ద్వారా అందించే పౌష్టికాహారం గు రించి వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ ప్రసన్న, అంగన్ వాడి టీచర్లు కవిత, శైలజ, కౌసల్య, రాజేశ్వరి, సరస్వతి, కుర్మమ్మ, భాగ్యవతి, చిన్నారులు వారి తల్లులు తదితరులు ఉన్నారు.
బండ్లగేరీ అంగన్ వాడి కేంద్రం2లో అమ్మ మాట-అంగన్ వాడి బాట
జిల్లా కేంద్రం బండ్ల గేరి అంగన్ వాడి-2 కేంద్రంలో శుక్రవారం అమ్మ మాట-అంగన్ వాడి బాట నిర్వహించారు. ఈ కార్యకమంలో భాగంగా చిన్నారులకు అంగన్ వాడి కేంద్రంలో టిహెచ్ఆర్, హెచ్ సిఎం ద్వారా పౌష్టికాహారం గురించి వివరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డి డ బ్ల్యు ఓ జరీనా కార్యక్రమన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ 3 + పిల్లలను అంగన్ వాడి ల్లో చేర్పించి వారి భవిష్యత్తుతో మంచి బాట వేయాలని కోరారు. పౌష్టిక ఆహారం ప్రాధ్యాన్యత గురించి వివరించారు.