17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రథయాత్రను జయప్రదం చేయండి

27-06-2025 05:54 PM

ఇస్కాన్ ఆలయ ప్రతినిధి రంగా తీర్థ దాస్

సిద్దిపేట: ఒరిస్సా రాష్ట్రంలో మాత్రమే జరిగే పూరి జగన్నాథ రథయాత్రను సిద్దిపేటలో నిర్వహించనున్నట్లు ఆలయ ప్రతినిధి రంగతీర్థదాస్ పేర్కొన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒరిస్సా రాష్ట్రంలో మాత్రమే జరిగే జగన్నాథ రథయాత్రను హరే కృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 29వ తేదీన సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయం పక్కన ఉన్న శ్రీనివాస ధ్యాన మందిరం నుండి మధ్యాహ్నం మూడు గంటలకు రథయాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ రథయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.