7 July, 2026 | 6:25 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

రథయాత్రను జయప్రదం చేయండి

27-06-2025 05:54 PM

ఇస్కాన్ ఆలయ ప్రతినిధి రంగా తీర్థ దాస్

సిద్దిపేట: ఒరిస్సా రాష్ట్రంలో మాత్రమే జరిగే పూరి జగన్నాథ రథయాత్రను సిద్దిపేటలో నిర్వహించనున్నట్లు ఆలయ ప్రతినిధి రంగతీర్థదాస్ పేర్కొన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒరిస్సా రాష్ట్రంలో మాత్రమే జరిగే జగన్నాథ రథయాత్రను హరే కృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 29వ తేదీన సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయం పక్కన ఉన్న శ్రీనివాస ధ్యాన మందిరం నుండి మధ్యాహ్నం మూడు గంటలకు రథయాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ రథయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.