calender_icon.png 13 June, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ జామ్ తో పుష్కర భక్తుల ఇబ్బందులు

25-05-2025 04:31:04 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాలేశ్వరం(Kaleshwaram)లో నిర్వహిస్తున్న పుష్కరాలలో 11వ రోజు అయిన ఆదివారం నాడు అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహాదేవపూర్ కాలేశ్వరం అటవీ మధ్యలోనే అన్నారం క్రాస్ నుండి వన్ వే ట్రాఫిక్ మళ్లించడంతో మద్దులపల్లి పూసుకుపల్లి మధ్యలో అడవిలో చిక్కుకుపోయిన పుష్కర భక్తులు, నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మంచినీటి సరఫరాణం ట్యాంకుల ద్వారా, వాటర్ బాటిల్ పంపిణీ చేస్తున్నారు. రద్దీ కారణంగా నాలుగు నుండి ఐదు గంటలు ట్రాఫిక్ లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు తెలుపుతున్నారు.

లక్ష్యానికి మించి వాహనాలు రావడంతో పార్కింగ్ స్థలం సరిపోకపోవడంతో వాహనాలను ఎక్కడ నిలుపుదల చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులను అంచెనవేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని పుష్కర భక్తులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పుష్కరాలలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించకపోవడంతో ఒక్క జిల్లా అధికారులతోటే అన్ని సమస్యలకు జిల్లా అధికారులు సరిపోవడం లేదు. ఈ విధంగా కావడంతో అటు దేవాలయంలోనూ ఇటు రోడ్ల వెంబడి ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందిగా మారింది. ఈరోజు రాష్ట్ర గవర్నర్ రావడంతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కాలేశ్వరం క్షేత్రంలోనే ఉండి ట్రాఫిక్ సమస్యపై అధికారులు సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్ సమస్యలను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు.