12 March, 2026 | 8:49 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అడెల్లికి పోటెత్తిన భక్తులు

25-05-2025 04:33 PM

సారంగాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) సారంగాపూర్ మండలంలోని అడెల్లి పోచమ్మ దైవ దర్శనానికై ఆదివారం తండోపా తండాలుగా భక్తులు తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రాంతం నుండి కూడా వచ్చి భక్తులు కోనేరులో తల స్నానాలు ఆచరించి, నీలాలు సమర్పించి, ముడుపులు కట్టి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచ బోనాల నైవేధ్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరవ్వడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపటి వరకు ఫోన్ సిగ్నల్స్ పని చేయలేదు. అయితే జన సంచార సమూహం అధికంగా ఉన్న చోట ఫోన్ సిగ్నల్స్ పని చేయవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.