calender_icon.png 19 June, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు పుష్ప మేకర్స్ విరాళం

07-09-2024 12:17:24 AM

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవితాలు అస్తవ్యస్తం కావడంతో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఆయా ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. టాలీవుడ్ నటులు, నిర్మాణ సంస్థలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.50 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు విరాళం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలు త్వరలోనే ఈ సంక్షోభం నుంచి కోలుకుంటాయని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, అశ్వినీదత్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు సహాయక చర్యలకు విరాళాలు అందించారు.