11-06-2025 06:59:13 PM
హత్యకు పాల్పడిన నలుగురి అరెస్టు రిమాండ్..
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..
కామారెడ్డి (విజయక్రాంతి): వివాహేతర సంబంధమే గ్రామ కార్యదర్శి కృష్ణ హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ కార్యదర్శి కృష్ణ హత్య కేసు వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడంగల్ పంచాయతీ కార్యదర్శి కృష్ణకు సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో సుజాత బంధువులు గుర్తించి కృష్ణను మట్టు పెట్టేందుకు పథకం ప్రకారం పిట్లం సమీపంలోని రెడ్డి చెరువులో దాడి చేసి హత్య చేసి చెరువులో మృతదేహాన్ని పడేయడమే కాకుండా అతని బైక్ ను కూడా చెరువులో పడేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. సుజాత భర్త మల్కన్న, బాలరాజు, మల్కయ్య, సుజాతలను బుధవారం ఆరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు తెలిపారు. హత్య కేసును చేదించిన బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి, సిఐ, ఎస్ఐ పోలీస్ సిబ్బందిని ఎస్పి రాజేష్ చంద్ర అభినందించారు.