13-06-2025 01:55:16 AM
సంగారెడ్డి, జూన్ 12(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని గ్రామాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం అందోల్ మండలం నేరడి గుంట, వట్టిపల్లి మండలం గట్టుపల్లి లో నిర్వహించిన అంగన్వాడి బాట బడిబాట కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా గ్రామ పాఠశాలల్లో, అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
జిల్లాలో 1249 ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం గల 5248 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీటితోపాటు జిల్లాలో బాలికల కోసం ప్రత్యేకంగా 22 కస్తూర్భా పాఠశాలలు, పది ఆదర్శ పాఠశాలలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన వసతుల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలలో ప్రారంభానికి ముందే అన్ని రకాల వసతులు కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో ఒకటో తరగతి నుండి మూడో తరగతి వరకు వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, పిడి మెప్మా గీత, ఆర్డీవో పాండు, మార్కెటింగ్ చైర్మన్ జగమోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.