calender_icon.png 14 June, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ కంటే ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య

13-06-2025 01:56:00 AM

  1. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

రఘునాథపాలెం మండలం పువ్వాడనగర్‌లో మండల ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన కలెక్టర్

ఖమ్మం, జూన్ 12 (విజయ క్రాంతి):ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.గురువారం రఘునాధపాలెం మండలం పువ్వాడ నగర్ లో మండల ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకోవాలని పాఠశాలలు ప్రారంభించిన మొదటి రోజే పాఠ్య పు స్తకాలు, ఏక రూప దుస్తుల పంపిణీ చేస్తున్నామని అన్నారు.

ప్రతి రోజు పిల్లలు సాయంత్రం పూట కొంత సమయం చదువుకోవాలని, కొంత సమయం ఆడుకోవాలని అన్నారు. మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు.బాల్యంలో చదువు, ఆటలు, ఆరోగ్యం చాలా కీలకమని అన్నారు.

ఇంటి భోజనంతో మంచి ఆరోగ్యం వస్తుంద ని, బయటి ఫుడ్ తినవద్దని అన్నారు. పిల్లలు తమ లక్ష్యాలను ఒక పుస్తకంలో రాసుకొని ప్రతి రోజూ గుర్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ వేసవి సెలవులు అనంతరం సంతోషంగా పం డుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించుకోవడం జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని అన్నారు.

ప్రతి వర్గానికి చెం దిన పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జిల్లాలో మూతపడిన పాఠశాలల ను పునః ప్రారంభిస్తున్నామని, పాఠశాలలో అవసరమైన మౌ ళిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ బి. పురంధర్, ర ఘునాధపాలెం మండల తహసిల్దారు ఎస్. శ్వేత, ఎంపిడిఓ అశోక్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి, గ్రామ కార్యద ర్శి వై. రాంబాబు, ఐసిడిఎస్. సూపర్వైజర్ జి. వెంకటలక్ష్మి, అం గన్వాడి టీచర్ జి. విజయ కుమారి, అంగన్వాడి హెల్పర్ బి. శ్రావణి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.