calender_icon.png 17 June, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

14-06-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కుమ్రం భీం ఆసిఫాబాద్,జూన్ 13(విజయ క్రాంతి) : విద్యార్థులకు మంచి భవిష్య త్తును అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. శుక్ర వారం ఆసిఫాబాద్ మండలం బూరుగుడ గ్రామంలోని  మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ స్థాయి అక్షరాభ్యాస కార్యక్రమానికి హాజరై నూతనంగా చేరిన విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిరోజు క్రమం తప్పకుండా విద్యార్థులను పాఠశాలలకు పంపించాలని తెలిపారు.

విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించడం జరుగుతుందని, పోషకాహార విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు. నిష్ణాతులైన, అనుభవజ్ఞు లైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు ఎస్. ఎల్. ఎన్. పద్ధతిన విద్యాబోధన చేయడం జరుగుతుందని, తద్వారా విద్యార్థులలో కనీస అభ్యాసన సామర్ధ్యాలు పెంపొందించడం జరుగుతుందని తెలిపారు.

విద్యార్థులు చిన్నతనం నుండే ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకునేలా వారిని తీర్చిదిద్దడం జరుగుతుం దని, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా వెనుకబడిన విద్యార్థులకు విద్యా బోధన చేసి అభ్యాసనా సామర్థ్యాలు పెంపొందించడం తో పాటు నేషనల్ అచీవ్ మెంట్ సర్వేలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సమ కూర్చిన బ్యాగ్ లను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, మండల విద్యాధికారి రాథోడ్ సుభాష్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సదాశివ్, కాంప్లెక్స్ సాయి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.