14-06-2025 12:00:00 AM
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ
ఆదిలాబాద్, జూన్ 13 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణు లు కృషి చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షురా లు ఆత్రం సుగుణ అన్నారు. ఇటీవల టీపీసీసీ ఉపాధ్యక్షురాలుగా నియతులైన ఆత్రం సుగుణ ను డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజా రెడ్డి, పలువురు పార్టీ శ్రేణులు శాలువాతో సన్మాననించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంద ర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజా రెడ్డి మా ట్లాడుతూ ఇటీవల ‘సంవిధాన్ బచావో ప్రోగ్రామ్’ రాష్ట్ర కమిటీలో సభ్యురాలుగా అవకాశం రావటం, ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షురాలుగా నియమితులు అయ్యారని, రానున్న రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టాలని అడ్డి బోజారెడ్డి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు నలిమెల నవీన్ రెడ్డి, పలువురు డీసీసీబీ డైరెక్టర్లు పాల్గొన్నారు.