calender_icon.png 29 June, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ దేవస్థాన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమం.

28-06-2025 10:26:41 PM

సనత్ నగర్,(విజయక్రాంతి): బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బల్కంపేట శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ-పోచమ్మ దేవస్థానం కోసం 13 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటుచేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.శనివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కొత్తగా నియమితులైన ట్రస్ట్ సభ్యులు ఆలయ ఈఓ మహేందర్ గౌడ్ మరియు అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా  సురేష్ వర్మ ట్రస్ట్ బోర్డు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడం గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఆయనకు మొదటి నుంచి ఆధ్యాత్మిక సేవలపై ఉన్న నిబద్ధత, ప్రజలతో మమేకంగా ఉండే స్వభావం ఆలయ అభివృద్ధిలో పెద్దదైన పాత్ర పోషిస్తాయని విశ్వాసం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా గోదాసి అజయ్ కుమార్ మరియు ఆర్.బి. నరేష్   సురేష్ వర్మను హృదయపూర్వకంగా అభినందించారు. ట్రస్ట్ బోర్డులో ఆయనకు అవకాశం లభించడం సానుకూల మార్పులకే సంకేతమని వారు అన్నారు. ఆయన నాయకత్వంలో ఆలయ అభివృద్ధికి తోడ్పాటు కలుగుతుందన్న నమ్మకాన్ని వారు వ్యక్తంచేశారు.భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త బోర్డుకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేవస్థాన పరిపాలనలో పారదర్శకత, అభివృద్ధి లక్ష్యంగా ట్రస్ట్ బోర్డు ముందుకు సాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.