23-05-2025 10:52:45 PM
రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డి
పెద్దపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ... రైతులకు నేరుగా రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ నుంచి నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కృషి చేస్తున్నామని, డీలర్లు సైతం ఈ విషయంలో పూర్తి స్థాయి సహాకారం అందించాలని అన్నారు. రైతులకు ఎక్కడ నష్టాలు రాకుండా నాణ్యమైన విత్తనాలు అందించేందుకు కృషి చేస్తున్నామని, రైతులకు ఊరు పేరు లేని విత్తనాలు అమ్మడానికి వీలు లేదని పేర్కొన్నారు.
దిగుబడి కూడా ప్రభుత్వ రంగ సంస్థలో తయారు చేసిన విత్తనం బాగా ఉందన్నారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యం విత్తనాల రకాలు అందుబాటులో ఉన్నాయని, పెద్దపల్లి జిల్లాలో కనీసం పదివేల క్వింటాళ్లు ప్రభుత్వ రంగ విత్తనాలు అమ్మాలని డీలర్లకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్, మండల వ్యవసాయ అధికారులు, డీలర్లు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.