calender_icon.png 30 May, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాల ప్రచారంలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర..

29-05-2025 08:44:30 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారంలో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర వహించాలని, గ్రామస్థాయిలో సంక్షేమ పథకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించి వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మానుకోట ఇన్చార్జి భూక్యా వెంకటేష్(Manukota Incharge Bhukya Venkatesh), డివైసిసి జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్ మాట్లాడుతూ... యువజన కాంగ్రెస్ కమిటీలను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టం చేసి పార్టీ, ప్రభుత్వ ప్రచార బాధ్యతల్లో కీలకం చేయాలని సూచించారు. డిసిసి అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి మాట్లాడుతూ... యువజన కాంగ్రెస్ ద్వారానే కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టంగా మారుతుందని పేర్కొన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి సాయి తేజ, చాగంటి సందీప్, విజయ్, వెంకటేశ్వర్లు, అల్లం గణేష్ యాదవ్, శ్రావణ్, భాస్కర్ యాదవ్ అభి, చౌదరి, కొట్టం రాము, చరణ్, ఆవుల సురేష్ యాదవ్, రాజేష్, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.