31-05-2025 04:46:55 PM
తొగుట సీఐ లతీఫ్..
దౌల్తాబాద్: రైతులకు నాణ్యమైన విత్తనాలను అమ్మకం జరపాలని, నాసిరకం విత్తనాలను రైతులకు నమ్మించి మోసం చేసి అంటగడితే కఠిన చర్యలు తీసుకుంటామని తొగుట సీఐ లతీఫ్(CI Lateef) అన్నారు. శనివారం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లో డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి డీలర్ ఎరువులు, పురుగుల మందుల విత్తనాలు, రిజిస్టర్లు బిల్లు బుక్కులు తప్పకుండా రాయాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మకూడదని ఒకవేళ నమ్మినట్లయితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్, ఇంచార్జ్ మండల వ్యవసాయ అధికారి సత్య అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.