09-08-2024 12:05:00 AM
యూనిమోని ఇండియన్ డైరెక్టర్ కృష్ణన్
కూకట్పల్లి, ఆగస్టు 8: యూనిమోని ఫైనాన్స్ సంస్థ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తోందని యూనిమోని ఇండియన్ డైరెక్టర్ కృష్ణన్ ఆర్ పేర్కొన్నారు. కూకట్పల్లిలో బుధవారం యూనిమోని ఫైనాన్స్ శాఖను ఆయన ముఖ్య అతిథిగా హా జరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ సంస్థ ఆర్థిక రంగంలో నమ్మక మైన శక్తిగా ఎదిగి ఎంతోమంది వినియోగదారులకు అనేక రంగాల్లో సేవలు అందిస్తోందని తెలిపారు.
విదేశీ మారకం, గోల్డ్లోన్, ఇన్వర్డ్ మనీ ట్రాన్స్ఫర్, ప్రయా ణం వంటి సేవలను అందిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అదేవిధంగా సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సం దర్భంగా భువన విజయం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జోనల్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి, రీజినల్ హెడ్ కే శ్రీనివాస్, కూకట్పల్లి శాఖ హెడ్ బీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.