09-08-2024 12:05:00 AM
చర్చలు జరిపిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): తమ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్ను డిగ్రీ విద్యార్థినులకే కేటాయించాలని నిజాం కాలేజీ విద్యార్థులు ఐదు రోజులుగా చేస్తున్న ఆందోళనను విరమించారు. గురువారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కాలేజీకి చేరుకొని విద్యార్థులు, వైస్ ప్రిన్సిపాల్తో చర్చించారు. సెప్టెంబర్లో పీజీ సెకండియర్ విద్యార్థుల చదువు పూర్తికానున్న నేపథ్యంలో అప్పటి వరకు డిగ్రీ విద్యార్థులు సహనంతో ఉండాలని, ఆ తర్వా త హాస్టల్ను డిగ్రీ విద్యార్థులకు కేటాయిస్తామని, పీజీ విద్యార్థులతో చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి సమస్య పూర్తి పరిష్కారా నికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ వెంకట్ హామీతో విద్యార్థులు తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.