18 March, 2026 | 11:51 AM

Breaking News

మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •   తప్పుతై తప్పకుండా ప్రశ్నిస్తాం!   •  

రైల్వేస్టేషన్ ఆధునీకరణపనులను పూర్తిచేయాలి

15-07-2024 01:40 AM

ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘరామిరెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం, జులై 14(విజయక్రాంతి): భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ ఆధు నీకరణ పనులు వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ రామసహాయం రాఘరామిరెడ్డి ఆదేశించారు. ఎంపీ హోదా లో తొలిసారి ఆయన ఆదివారం కొత్తగూడెంలో పర్యటించారు. రైల్వే స్టేషన్‌లో చేప డతున్న ఆధునీకరణ పనులపై ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పనులు చేపట్టాలన్నారు. అనంత రం కొత్తగూడెంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ వచ్చేలా చేసిన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నా మన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పర్యటనలో భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ మాస్టర్ విశ్వనాథ్, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, రైల్వే అధికారులు రామ్ జన్ వీణా, పాషా, రాజీరెడ్డి ఉన్నారు.