25-06-2025 12:00:00 AM
ఇంకా అధికారికంగా ప్రకటించని రైల్వే శాఖ
న్యూఢిల్లీ, జూన్ 24: రైలు టికెట్ ధరలను రైల్వేశాఖ పెంచే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నాన్ ఏసీ మెయిల్/ ఎక్స్ప్రెస్ రైలు టికెట్ ధరను కిలోమీటర్కు ఒకపైసా చొ ప్పున, ఏసీ తరగతి టికెట్ ధరను కిలోమీటరుకు రెండు పైసల చొప్పు న పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి రైలు టికెట్ ధరలను ప్రభుత్వం పెంచలే దు.
అయితే ఈ ధరల పెంపుపై రైల్వేశాఖ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. నెలవారీ సీజన్ టికెట్ ధ రలో ఎలాంటి మార్పులు ఉండబోవని రైల్వే వర్గాలు పేర్కొంటున్నా యి. ఇప్పటికే తత్కాల్ టికెట్ల బుకింగ్లో రైల్వే శాఖ ఆధార్ వెరిఫికేష న్ ను తీసుకొచ్చింది. ఈ విధానాన్ని కూడా జూలై 1 నుంచే అమలు చేయనున్నారు.