25-06-2025 12:00:00 AM
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
చెన్నై, జూన్ 24: సంస్కృత భాష ను ప్రోత్సహిస్తూ కోట్లు కుమ్మరిస్తున్న కేంద్రం, తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషలపై మొసలి కన్నీరు కారుస్తోందని మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర తీరుపై మండిపడ్డారు.
గత దశాబ్దకాలంగా సంస్కృత భాష అభివృద్ధి కోసం రూ. 2,352.59 కోట్లను కేంద్రం ఖర్చు చేసినట్టు ఉన్న నివేదికలను ఎక్స్లో పోస్ట్ చేస్తూ సీ ఎం కేంద్ర విధానాలను తప్పుబట్టా రు. తమిళంపై సవతి తల్లి ప్రేమ చూ పిస్తూ.. నిధులు మొత్తం సంస్కృత భాషాభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.