25-06-2025 12:00:00 AM
ఇజ్రాయెల్ దాడుల్లో 56వేలు దాటిన మరణాలు
గాజా సిటీ, జూన్ 24: గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మం గళవారం ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడుల్లో వందల సం ఖ్యలో గాయపడ్డారు. ఇప్పటి వరకూ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 56 వేలు దాటిందని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.
ఈ దా డుల్లో 1,31,848 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారని తెలిపింది. కేవలం ఈ ఏడాది మార్చి 18 నుంచి ఇప్పటివరకు జరిగిన దాడుల్లోనే 5,759 మంది మరణించినట్టు తెలిపింది. గాజా స్ట్రిప్పై నిరంతర దాడులు జరుగుతుండటంతో ప్రాణనష్టం భారీగా ఉంటుంది.