28-05-2025 12:00:00 AM
నిర్మల్ మే 27(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మంగళవారం మళ్లీ వర్షం కురవడంతో రైతులు ప్రజలు ఇబ్బందికి గురయ్యా రు. గత మూడు రోజుల నుంచి వరుసగా వర్షాలు కురవడంతో వరి ధాన్యం కేంద్రా ల్లో నిలువ ఉంచిన వారి ధాన్యం నడుచుకోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో నర్సాపూర్లో 14.2, దిల్వార్పూర్లో 22.08, సారంగాపూర్లో11.2,నిర్మల్ రూల ర్లో 12.4, పెంబి మండలంలో 31.02. మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.
వర్షాలకు తోడు బలమైన గాలులు వేయడంతో నర్సాపూర్ మండల కేంద్రంలో చెట్టు కొమ్మలు రోడ్లపై విరిగిపడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మామడ మండల కేంద్రంలో నరసయ్య అనే వ్యక్తికి చెందిన పాత కూన ఇల్లు కూలిపోగా ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోళ్ళపై ఆరబోసిన వరి జొన్న పంటలు తడిసిపోవడంతో రైతులు పంటలు కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు.