28-05-2025 12:00:00 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, మే 27(విజయక్రాంతి): భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రానున్న నాలుగు రోజులు ఉత్త ర తెలంగాణా జిల్లాలలో ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలు నదులు, వాగులు, వంకల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ తీగలు తెగిన ట్లయితే లేదా ఇతర ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినపుడు వెంటనే సంబంధిత విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
అత్యవసర అవసరాల కోసం జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 63056 46600 ను సంప్రదించాలని, రైతులు తమ పంటలను సుర క్షితంగా ఉంచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు అధికంగా కురిసే ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్, మునిసిపల్, పంచాయతీ, వ్యవసాయ శాఖల అధి కారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.