calender_icon.png 28 June, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజా రమేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

27-06-2025 09:59:53 PM

కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్ డిమాండ్

మందమర్రి,(విజయక్రాంతి): చెన్నూరు ఎమ్మెల్యే రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై చెన్నూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ చేసిన అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకుని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు పైడిమల్ల నర్సింగ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

చెన్నూరు నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ రాష్ట్రమంత్రి వివేక్ వెంకటస్వామి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత బిఆర్ఎస్ హయాంలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ గెలిచిన అనంతరం నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధిని ఓర్వ లేక మంత్రి పై ఆవాకులు చేవాకులు మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.