27-06-2025 09:55:55 PM
సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కృష్ణ
పెన్ పహాడ్: వివిధ రంగలాలో హమాలి కార్మికులగా పని చేస్తన్న వారందరికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దూపాడులో శ్రీరామ్ రైస్ మిల్లు హమాలి కార్మికులతో కలిసి గుమస్తా సందీప్ కు సమ్మె నోటీసు అందజేసి కార్మికులు ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. కార్మికులు ఎంతో కాలంగా పోరాడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్పొరేటు శక్తులను కొమ్ముకాస్తున్న కేంద్రంలో లో బీజేపీ ప్రభుత్వం అన్నారు. హమాలి కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఆరోగ్య భద్రత హెల్త్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వారికీ పింఛన్లు వివిధ సంక్షేమ పథకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు . జూలై 9న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను వేలాది మంది కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ హమాలి కార్మికులు రామ్, బాలక్, జితేందర్, రాజు, కృష్ణ, ఉదయ్, జానీ తదితరులు ఉన్నారు.