రాజన్న హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు
13-09-2024 12:03 AM
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశర సామి ఆలయ గత 30 రోజుల హుండీలను గురువారం లెక్కించారు. నగదు రూ.1.82 కోట్లు, బంగారం 150 గ్రాములు, వెండి 14. 7 కిలోలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు.






