30-10-2025 12:00:00 AM
 
							అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వంలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై నవంబర్ 21న థియేట్రికల్ రిలీజ్కు వస్తోంది. ఈ సందర్భంగా మూవీటీమ్ బుధవారం ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బన్నీ వాస్ మాట్లాడుతూ.. “ఇది కాల్పనిక కథ అయితే మనం ఆ దర్శకుడి ఊహకు ఆశ్చర్యపోయేవాళ్లం.
ఇలా ఎలా ఆలోంచించారు అనుకునేవాళ్లం. కానీ, కొందరి జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా తీశారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక భారంతో, భావోద్వేగంతో వస్తారు” అన్నారు. హీరో అఖిల్ మాట్లాడుతూ.. “నవంబర్ 21న మా మూవీ చూడండి.. తప్పకుండా నచ్చుతుంది” అన్నారు. హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ.. “ఈ సినిమా, ఇందులో నేను చేసిన రాంబాయి క్యారెక్టర్ నా మనసుకు ఎంతో దగ్గరయ్యాయి.
తెలుగు ప్రేక్షకుకు మా సినిమా బాగా నచ్చుతుంది” అని తెలిపింది. డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ.. “చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేకుంటే మరొకరి ఇంటి కిటికీలో నుంచి సినిమాలు చూసేవాళ్లం. ఈరోజు నేను డైరెక్ట్ చేసిన సినిమా అదే టీవీ ప్రొడక్షన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2016 నుంచి ఈ కథ పట్టుకుని తిరుగుతున్నా. ఒకే నెరేషన్లో వేణు కథను ఓకే చేయడం..
ఈటీవీ విన్ వారికీ కథ నచ్చడం.. అలా ఈ సినిమా టేకాఫ్ అయ్యిం ది” అన్నారు. చిత్ర నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ “ఖమ్మం, వరంగల్ సరిహద్దులో చోటుచేసుకున్న వాస్తవ ఘటన ఇది. ప్రేమతో కూడిన విషాదభరితమైన ఈ సంఘటన ఆ ఊర్లోనే జరిగి అక్కడే సమాధి అయ్యింది. దాన్ని ఆధారం చేసుకుని ఈ కథను ఎంటర్టైనింగ్, మాస్ అప్పీల్ ఉండేలా దర్శకుడు సాయిలు స్క్రిప్ట్ రాశాడు.
7జీ బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, ఆర్ఎక్స్ 100, బేబి  చిత్రాల్లా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది” అన్నారు. నటుడు చైతు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “తెలంగాణ నేటివిటీని ఇంత పర్పెక్ట్గా చూపించిన సినిమా మరొకటి లేదు. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడం హ్యాపీగా ఉంది” అని చెప్పారు. సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి, ఈటీవీ విన్ నితిన్, సాయికృష్ణ, నిర్మాత వంశీ నందిపాటి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.