04-06-2025 12:00:00 AM
జై తెలంగాణ అననోళ్ళు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే లుగా ఉన్నారు
వనపర్తి, జూన్ 3 ( విజయక్రాంతి ) : వాల్మీకి సోదరులకు కేటాయించిన వివాదస్పద స్థలములో ఆదరాబాదరాగా అమరవీరుల స్థూపానికి స్థలం కేటాయించడం ఎమ్మెల్యే అవగాహన రాహిత్యానికి , అమరులను అవమానించేందుకే అని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మండిపడ్డారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని మాజీ మంత్రి నివాస గృ హంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కౌన్సిలర్ తిరుమల్ తో కలిసి ఆయన మాట్లాడారు.
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గతములో అమరవీరుల ఏకశిలా స్థూపం కలెక్టరేట్ ముందు గల పార్కులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారని అంతలోని ఎన్నికలు రావ డం వల్ల వీలుకాలేదు అని అన్నారు. అమరవీరులకు కె.సి.ఆర్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి హైదరాబాద్ నడిబొడ్డులో సెక్రటేరియట్ ఎదురుగా అమరవీరుల స్థూపం నిర్మించారని అదేవిధంగా ఉద్యమ సమయములో గన్ పార్క్ నందు అమరవీరుల స్థూపం నిర్మించారని వారు గుర్తు చేశారు.
ఉద్యమ సమయంలో జై తెలంగాణ అననోళ్ళు నేడు సి.యం., ఎమ్మెల్యే లుగా ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని అమరవీరులను గౌరవించాలటే గౌరవప్రదమైన చౌరస్తాలో లేదంటే జనసమూహం రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అన్నారు.
వాల్మీకి సోదరులకు మున్సిపల్ తీర్మానంతో కేటాయించిన స్థలములో స్థూపాన్ని నిర్మించడం వల్ల కుల సంఘాలకు చిచ్చు పె ట్టినవారవుతారని అన్నారు. ఎమ్మెల్యే నిర్ణయం మార్చుకొని అందరికీ అనువైన కలెక్టరేట్ సముదాయం ముందు పార్కులో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశములో రాష్ట్ర మార్కు ఫెడ్ మాజీ డైరెక్టర్ విజయ్ కుమార్, మాజీ జె.ఏ.సి ఛైర్మెన్ వేణు గోపాల్, నాయకులు నాగన్న యాదవ్, నీలస్వామి, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము, , తిరుపతయ్య, సునీల్ వాల్మీకి, నాగవరం రవీ, తోట.శ్రీను పాల్గొన్నారు.