16 April, 2026 | 11:56 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

రామ్మూర్తి మృతి పార్టీకి తీరని లోటు

20-02-2026 12:48 AM

మోతె, ఫిబ్రవరి 19 : ధరావత్ రామ్మూర్తి మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. గురువారం మండల పరిధిలోని బురకచర్ల గ్రామానికి చెందిన ధరావత్ రామ్మూర్తి(55) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సందర్శించి భౌతిక కాయంపై  అరుణ పతాకాన్ని కప్పి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ  నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ధరావత్ రామ్మూర్తి ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ గ్రామంలో పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. 

సిపిఎం ఆధ్వర్యంలో గ్రామంలో  ఇళ్ల స్థలాల పోరాటం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి కొండ భాస్కర్, సిపిఎం మండల కమిటీ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ, సిపిఎం గ్రామ సహాయ కార్యదర్శి చెరుకు శ్రీను,నాయకులు కొండా రాములు, పల్లె మరియమ్మ, ములకలపల్లి అశోక్, మక్కా అచ్చయ్య, రామచంద్రు, వాడగల సామ్రాజ్యం, సాలెమ్మ తదితరులు పాల్గొన్నారు.