20-02-2026 12:50:09 AM
మున్సిపల్ చెర్మన్ దొంతగాని శ్రీనివాస్.. వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ రావు
హుజూర్ నగర్, ఫిబ్రవరి 19: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషితో హుజూర్ నగర్ పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేస్తామని మున్సిపల్ చెర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ రావు అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు...
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఉన్నటువంటి మసీదుల ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంపీఓ లావణ్య,19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ,ముస్లిం మత పెద్దలు షేక్ సైదా,మన్సూర్ అలీ,రఫీ,షఫీ,మున్సిపల్ అధికారులు వినోద్, రంగారావు,తదితరులు పాల్గొన్నారు.