03-06-2025 12:10:46 AM
భద్రాచలం, జూన్ 2 (విజయక్రాంతి): ఐటీడీఏ భద్రాచలం ప్రాజెక్టు మానిటరింగ్ విభాగంలో ఏసీఎంవోగా రమేశ్ సోమవా రం బాధ్యతలు స్వీకరించారు. ఐటీడీఏ పీఎంఆర్సీ విభాగంలో ఏసీఎంవోగా విధులు నిర్వ హించిన రమణయ్య మే 31న ఉద్యోగ విరమణ అయినందున ఆయన స్థానంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్గా ఉప్పుసాకలో పని చేస్తున్న రమేష్ను ఏసీఎంవోగా విధులు నిర్వహించడానికి ఐటీడీఏ పీవో బీ రాహుల్ ఉత్తర్వులు జారీ చేసినందున పదవీ విరమణ చేసిన రమణయ్య వద్దనుంచి ఏసీఎంవోగా బాధ్యతలు తీసుకొని ఆయన విధులలో జాయిన్ అయినట్లు రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏసీఎంవో రమణయ్య పాల్గొన్నారు.