03-06-2025 12:11:02 AM
మహబూబ్నగర్, జూన్ 2 (విజయక్రాంతి) : పరీక్ష ఏదైనా ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తుంది. జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాల తమకు సాటి మరి ఎవరన్నా రీతిలో అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలలో దేశంలోని ప్రతిష్టాత్మకమైన 23 ఐఐటీల్లో బీటెక్,బిఎస్ కోర్సులలో ప్రవేశాల కోసం మే 18 వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలలో ఉన్నత ఫలితాలను సాధించింది.
వాగ్దేవి జూనియర్ కళాశాల చెందిన విద్యార్థిని అశ్విని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి 2610 ర్యాంక్ సాధించినదని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ సాధారణ విద్యార్థులచే అసాధారణ ఫలితం రాబట్టడం చాలా ఆ నందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అధ్యాపక బృందం ఎనలేని సేవలు చేస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయికీ తీసుకుపోయేలా ముందుకు సాగడం చాలా సంతోషంగా ఉందని తె లిపారు. ఈ కార్యక్రమంలో ఐఐటి అకాడమీ ఇన్చార్జ్ పావని రెడ్డి, అధ్యాపకులు యాకూబ్, గో విందరాజులు, సందీప్, మహేష్ గౌడ్, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.