30-05-2025 11:57:35 PM
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
హనుమకొండ,(విజయక్రాంతి): ప్రజలకు ధైర్యాన్ని కలిగించాటానికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. శుక్రవారం హన్మకొండ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్ని జెండా ఊపి ఈ కవాతు ప్రారంభించారు. హన్మకొండ బస్టాండ్, బ్రాహ్మణ వాడ, అలంకార్ జంక్షన్, హన్మకొండ చౌరస్తా మీదుగా అశోక జంక్షన్ వరకు ఈ కవాతు కొనసాగినది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం వరంగల్ పోలీస్ కమిషనరరేట్ పరిధిలో ఏడు రోజుల పాటు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కవాతు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కవాతు ముఖ్య ఉద్దేశం ఎలాంటి అల్లర్లు, మత ఘర్షణలు తలెత్తిన తక్షణమే స్పందించి స్థానిక పోలీసులకు సహకారం అందిస్తూ ప్రజలకు శాంతి భద్రతలపై భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కవాతు నిర్వహిస్తున్నట్లుగా పోలీస్ కమిషనర్ చెప్పారు. ఈ కార్యక్రమం సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఆర్. ఏ.ఎఫ్ డిప్యూటీ కామాండెంట్ సరస్వతి, హన్మకొండ ఏసీపీ నర్సింరావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇన్స్ స్పెక్టర్లు సతీష్, రవికుమార్, సత్యనారాయణ రెడ్డి లతో పాటు ట్రాఫిక్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.