31-05-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి, మే 30 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మా పూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాలయం శుక్రవారం ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివయ్య అనుగ్రహం మన అందరిపై ఉండాలని ప్రజలందరిని చల్లగా చూడాలని దేవుని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు యువకులు, తదితరులు పాల్గొన్నారు.