31-05-2025 12:00:00 AM
ఆన్లైన్ విధానంలో పరీక్ష
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా 74 పరీక్షా కేంద్రంలో ఆదివారం ఆన్లైన్ విధానంలో టీజీ ఎడ్సెట్ పరీక్ష జరుగనున్నది. పరీక్షకు 38,758 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో అబ్బాయిలు 7,218 మంది కాగా, అమ్మాయిలు 31,539 మంది, ఒకరు ట్రాన్స్జెండర్.
పరీక్ష రెండు సెషన్లలో జరుగు తుందని, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని పరీక్షల రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ బైరు వెంకట్రామ్రెడ్డి తెలిపారు.