భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.
29-04-2026 09:24 PM
కౌట(బి) గ్రామంలో కొనసాగుతున్న రథయాత్ర
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కౌట(బి )గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజు అయిన బుధవారం భక్తులు రథయాత్రను నిర్వహించారు.ఈ సందర్భంగా వందలాదిమంది బ్రహ్మేంద్ర స్వామి భక్తులు కార్యక్రమానికి హాజరై ప్రధాన వీధుల గుండా కొనసాగిన పాదయాత్రలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వీరబ్రహ్మేంద్రస్వామి భక్తజన మండలి వారి తెలిపారు.చివరి రోజైనా ఒకటవ తేదీన వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం తో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.






