calender_icon.png 27 June, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాలు వాడకం, చేయడం ప్రమాదకరం..

26-06-2025 10:26:53 PM

మత్తు పదార్థాలకు ఎవరు బానిస కావొద్దు.

డ్రగ్స్ మహమ్మారిని తరిమికోడదాం. 

డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మిద్దాం.

మత్తు పదార్థాల వాడకంపై అవగాహన సదస్సులు నిర్వహించాలి.

మంత్రి సీతక్క..

ములుగు (విజయక్రాంతి): యువతి యువకులు మత్తు పదార్థాలను వాడకుండా అన్నిచోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలని, మత్తు పదార్థాలను వాడకం చేయడం ఒక భూతం లాంటిదని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం(Anti-Drug Day) సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంనకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... నేటి సమాజాన్ని డ్రగ్స్ భూతంలా పట్టి పీడిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నేటి సమాజంలో కొందరు అక్రమార్కులు వ్యాపారాత్మక ధోరణిలో పసి పిల్లలకు చాకోలెట్స్ రూపంలో డ్రగ్స్ ను అలవాటు చేయించి ఆ మత్తులోకి లాగేస్తుండటం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. దీన్ని సవాల్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడం కోసం ఈ కార్యక్రమాలను నిర్వహిoచడం జరుగుతుందని అన్నారు. యువత డ్రగ్స్ కి అలవాటు కావడం వలన వారి నిండు భవిష్యత్తు చీకటిలోకి నెట్టివేయబడుతుందని అన్నారు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల పై కూడా అత్యంత క్రూరంగా  జరుగుతున్న లైంగిక దాడుల్లో డ్రగ్స్ తీసుకున్నవారే అధికంగా ఉంటున్నారని అన్నారు. ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే చాలా కష్టమైన విషయం కాబట్టి, మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుందని, దీనిని విజయవంతం చేయడానికి ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

డ్రగ్స్ వాడకం చేయడం వల్ల కుటుంబాలు నాశనం కావడమే కాకుండా ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతి యువకులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మత్తు పదార్థాలు వాడకం చేయడంలో దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వాడకం  వలన జరిగే అనారోగ్య సమస్యలపై యువత అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో యాంటీ డ్రెస్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని, దీని వాడకం చేయడం వలన జరిగే నష్టాలపై సంబంధిత శాఖల అధికారులు పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని మంత్రి అన్నారు.