23 April, 2026 | 6:17 AM

రేషన్ బియ్యం పట్టివేత

03-12-2024 12:00 AM

కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా సివిల్ సప్లు ఎన్‌ఫో ర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య తెలిపారు. కామారెడ్డి జిల్లా ముదాంగల్లిలోని లావణ్య నివాసంలో 15 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉన్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం దాడి చేసి నిల్వ ఉంచి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.