12 May, 2026 | 8:51 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

రావి శ్రీనివాస్ క్షమాపణలు చెప్పాలి

24-03-2025 01:34 AM

సిర్పూర్ యు, మార్చి23: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పై కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ రావి శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తు న్నామని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క అన్నారు.

ఆదివారం లింగాపూర్ మండలం లోని చోర్ పల్లి  గ్రామంలో విలేకరుల సమావేశం లో ఆమె కాంగ్రెస్ పార్టీ మహిళలతో కలిసి మాట్లాడారు. రావి శ్రీనివాస్ తన స్వార్థ రాజకీయాల కోసం మంత్రి సీతక్కను కించపరిచేలా మాట్లాడడం సరికాదని,మాట్లాడే ముందు సీతక్క గత చరిత్రను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

వెనుకబడిన వర్గాల ప్రజలను చైతన్య పరచటానికి అరణ్యం నుండి జనారన్యంలోకి వచ్చిన సీతక్క అంచలంచలుగా ఎదుగుతూ మంత్రి స్థాయికి ఎదిగారని అలాంటి ఆదివాసి బిడ్డపై రావి శ్రీనివాస్ ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.  కోవా ఇందిరా, యశోద, ప్రతిభ, లక్ష్మి, సుమ, విజయ,దుర్గం కళావతి, వేణి,కుంరం సింధు, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.