21 April, 2026 | 3:49 PM

Breaking News

జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •   ఘనంగా గ్రాడ్యుయేషన్ డే   •   రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం   •   ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో   •   పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’   •  

అడ్డగోలుగా తిరుగుతున్న రెడీమిక్స్ ట్యాంకర్లు

27-03-2025 12:32 AM

 దృష్టి సారించని ట్రాఫిక్ పోలీసులు  

 రాజేంద్రనగర్, మార్చి 26 (విజయ క్రాంతి): నార్సింగి, మణికొండ మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రెడీమిక్స్ ట్యాంకర్లు అడ్డగోలుగా తిరగడంతో వాహనదారులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడీమిక్స్ ట్యాంకర్లతో పాటు భారీ వాహనాలు నిర్ణీత సమయాల్లో మాత్రమే తిరగాల్సి ఉండగా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు సూచించిన సమయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఇష్టారాజ్యంగా నడుపుతుండటంతో వివిధ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్  ఏర్పడుతున్నాయి.

మణికొండ మున్సిపల్ పరిధిలోని ఆల్కపూరి కాలనీలో భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో వేలాపాల లేకుండా రెడీమిక్స్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కఠిన చర్యలు తీసుకోవాల్సిన ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.