14-06-2025 01:23:48 AM
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసేవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, పద వుల పంపిణీలో సామాజిక న్యాయాన్ని కా పాడుతుందని పునరుద్ఘాటించారు. జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాల అమలుపై డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో శుక్రవారం జరిగిన జూమ్ సమావేశంలో మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నటరాజన్ మాట్లా డుతూ.. సమాజంలో ఎవరి వాటా వారికి దక్కాలన్న సిద్ధాంతంతో రాహుల్గాంధీ పని చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఇచ్చిన అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించామని, పార్టీ కోసం పని చేసిన అందరికీ పదవులొస్తాయన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ మాట్లాడుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను తెలంగాణలో పెద్దఎత్తున నిర్వహించామని, ఏఐసీసీ అగ్రనేతలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం గర్వకారణంగా ఉం దన్నారు.
సంస్థాగత నిర్మాణం కూడా మన రాష్ట్రంలోనే బాగా జరుగుతోందని, రాష్ట్ర పరిశీలకులు, కోఆర్డినేటర్లు బాగా పని చేస్తున్నారని మహేశ్ కితాబిచ్చారు. మండల, జిల్లా స్థాయి కమిటీల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచిం చారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తున్న నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం పకడ్బందీగా చేపట్టాలన్నా రు. పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసిన వారందరిని పార్టీ గుర్తింపునిస్తోందన్నారు.