14-06-2025 01:22:12 AM
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ ) రెండో విడతలో 43,568 మంది విద్యార్థులు సీట్లు పొందారు. దోస్త్ రెండో విడత సీట్లను విద్యార్థులకు శుక్రవారం కేటాయించారు. మొత్తం 46,883 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, అందులో 43,568 విద్యార్థులు సీట్లు పొందారు. అయితే మొదటి విడతలో సీట్లు పొందిన వారిలో 6,077 మంది నచ్చిన కాలేజీలు, కోర్సుల్లో సీట్లు పొందేందుకు రెండో విడత కౌన్సెలింగ్లో పాల్గొని సీట్లను దక్కించుకున్నారు.
కామర్స్లో 13,900, ఫిజికల్ సెన్సైస్ 11,277, ఫిజికల్ సెన్సైస్ 11,277, లైఫ్ సెన్సైస్ 8,821, ఆర్ట్స్లో 5,032 చొప్పున సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 18లోగా ఆయా కాలేజీల్లో ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ చేయని పక్షంలో సీటు కోల్పోయినట్లేనని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ శు క్రవారం నుంచే ప్రారంభమయ్యిందని, ఈ నెల 23న సీట్లను కేటాయిస్తామని చెప్పారు.