calender_icon.png 9 September, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికార్డు స్థాయిలో లడ్డూ వేలం

09-09-2025 12:00:00 AM

రూ.25,01,116 లకు ఒగ్గు సాయికిరణ్ యాదవ్ సొంతం

అమీన్ పూర్ సెప్టెంబర్ 8 (విజయ్ క్రాంతి)అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో నందారం యువసేన ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డు వేలం ఘనంగా నిర్వహించారు. ఈసారి జరిగిన పోటీపోటీ లడ్డువేలంలో రికార్డు స్థాయిలో రూ. 25,01,116లకు లడ్డును సంసిద్ధి గ్రూప్ సీఈఓ ఒగ్గు సాయికిరణ్ యాదవ్ కైవసం చేసుకున్నారు.

లడ్డును అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ఒగ్గు సాయికిరణ్ స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ మాట్లాడుతూ 36 ఏళ్లుగా గణనాథుడి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈసారి లడ్డు రికార్డు స్థాయిలో వేలంలో పల కడం విశేషమన్నారు.

లడ్డు కైవసం చేసుకున్న ఒగ్గు సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ మూడేళ్లుగా లడ్డు కొనే ఆరాటం నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో నందారం యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.