2 July, 2026 | 12:32 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

సన్నబియ్యంతో తగ్గిన ఆర్థిక భారం

04-04-2025 12:23 AM

మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 3 (విజయక్రాం తి): నిరుపేదల ఆర్థిక భారాన్ని తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచ్చాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

గురువారం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని గగ్గలపల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మహిళలకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అన్నిటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ పథక ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి  పేర్కొన్నారు. బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని ఎమ్మెల్యే అధికారులను హేచ్చరించారు. వారితోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు తదితరులు ఉన్నారు.