calender_icon.png 14 June, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11న ఎలివేటెడ్ కారిడార్ నిర్వాసితులకు ఉపాధి కల్పనపై ప్రజాభిప్రాయ సేకరణ

10-06-2025 12:42:14 AM

మేడ్చల్, జూన్ 9 (విజయ క్రాంతి): ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులకు పునరావాసం, పునర్ ఉపాధి కల్పన కొరకు ఈనెల 11న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నామని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

హకీంపేట్, దేవర యాంజల్, తూముకుంట గ్రామాలకు సంబంధించిన వారు తూముకుంట మున్సిపాలిటీలో ఈనెల 11న ఉదయం 10:30 గంటలకు జరిగే పబ్లిక్ హియరింగ్ కు హాజరుకావాలని తెలిపారు. ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు ఉన్న తెలుపవచ్చని ఆయన తెలిపారు.