10-06-2025 12:41:39 AM
వలిగొండ,జూన్ 9 (విజయక్రాంతి) : వలిగొండ మండలంలోని మొగిలిపాక గ్రామానికి చెందిన మరల పవిత్ర గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన నిధుల నుండి రెండు లక్షల 50 వేల రూపాయల ఓ సి చెక్కును అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మామిడి సత్తిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పబ్బు ఎల్లయ్య, జై సింహా రెడ్డి, నరేంద్ర చారి, అంజిరెడ్డి, నిషాకర్ రెడ్డి, మరల నరసింహ, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.