calender_icon.png 13 June, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకర్‌ను తప్పించబోయి...

10-06-2025 12:44:02 AM

కందుకూరు,జూన్ 9 : బైకును తప్పించబోయి బైకి స్టు డీకొట్టి నేరుగా ట్రాన్స్ఫార్మర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్ట డంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి గాయా లైన విషాద సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.సిఐ సీతారాం కథనం ప్రకారం వివరాలు ఈవిధంగా ఉన్నాయి.

జైత్వారం గ్రా మానికి చెందిన సంగెం ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం 6 గంటలకు జైత్వారం గ్రామానికి చెందిన సంగెం శ్రీశైలం స్ప్లెండర్ ప్లస్ బైక్ బిఆర్ నంబర్ ఎపి 29 బియు 3962 గల దానిపై తన భార్య శ్రీలత,కొడుకు ప్రణీత్ కుమార్ లతో కలసి కందుకూర్ చౌరస్తా నుండి జైత్వారం గ్రామానికి వస్తుండగా,మార్గ మధ్యలో కొత్తగూడ చౌరస్తా మీదుగా జైత్వారం వెళ్ళే రోడ్డుకి కుడి వైపుకి మల్లగా,

అదే సమయములో శ్రీశైలం హైవే 765 పై కడ్తాల నుండి హైదరాబాద్ వైపుకి వస్తున్న అచ్చంపేట డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్ బిఆర్ నంబర్ టీఎస్ 31జడ్ 0057 గల దానిని నడుపుతున్న వ్యక్తి అతి వేగంగా,అజాగ్రత్తగా వచ్చి బైక్ ని టక్కరి ఇచ్చి పక్కనే ఉన్న ట్రాన్స్ఫవర్మర్ పెద్ద కరెంట్ స్థంభాన్ని డీకొట్టడం జరిగిందని,ఈ  ప్రమాదములో బైక్ పై ఉన్నవారికి,బస్ లో ఉన్నవారికి సుమారుగా 10 మందికి గాయాలు అయ్యయని తెలిపారు.

బస్ డ్రైవరు వివరాలు తెలుసుకొనగా కృష్ణయ్య (47) అని పిర్యాదు పేర్కొనగా దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.ఈ సంఘటనను తెలుసుకొని ఘటనా స్థలానికి తమ సిబ్బందితో చేరుకొని గాయాల పాలైన క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు ఆసుపత్రుల్లోకి తరలించి చికిత్స అందించడం జరిగిందనిసిఐతెలిపారు.