24-06-2025 11:25:10 PM
ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్పందించాలని వేడుకోలు..
చిన్న చింతకుంట: ఆ గ్రామానికి గత కొన్నేండ్లుగా ఆర్టీసీ బస్సు లేకపోవడంతో లేకపోవడంతో విద్యార్థులు తెగ ఇబ్బందులకు గురవుతున్నారు. మేము చదువుకునేందుకు వెళ్లాలి.. మా గ్రామం నుంచి ప్రతి రోజు 100 నుంచి 150 వరకు విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకొని తిరిగి వస్తున్నారు.. నీళ్ల తరబడి వేసవి, వర్షాకాలం, చలికాలం కాలం ఏదైనా రెండు కిలోమీటర్ల దూరం నడిచి బస్సు ఎక్కవలసి వస్తుంది. ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(MLA G Madhusudhan Reddy) స్పందించి వెంటనే మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సీసీ కుంట మండల పరిధిలోని గూడూరు గ్రామ ప్రజలు, విద్యార్థులు వేడుకుంటున్నారు. మా గ్రామానికి బస్సు వేయాలని పలుమార్లు ఆర్టీసీ అధికారులను కోరినప్పటికీ వారు స్పందించడం లేదని ఎమ్మెల్యే మా సమస్యని పరిష్కరించాలని కోరుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాకు సౌకర్యం కల్పించాలని ఆ గ్రామవాసులు ఆత్రుత కనబరుచుతున్నారు.