24-06-2025 11:28:13 PM
- తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
- అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని పట్టాలిచ్చాం
- జర్నలిస్టుల రిలే దీక్షల కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పేద జర్నలిస్టులకు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల జోలికి పోకూడదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం దగ్గర రెండు రోజులుగా టీడబ్ల్యూజే ఎఫ్ జర్నలిస్ట్ నాయకులు చేస్తున్న రిలే దీక్షలకు మాజీమంత్రి మద్దతు తెలియజేసి మాట్లాడారు. పట్టాలు ఇచ్చిన ఇండ్ల తాళాలు ఇవ్వడం లేదని, ఖాళీగా ఇండ్లు ఉన్న ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో గతంలో తాళాలు ఇవ్వలేకపోయామని చెప్పారు. దివిటిపల్లి, వీరన్నపేట వద్ద డబుల్ బెడ్ రూమ్స్ కడుతుంటే గతంలో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. వెంటనే పేదలకు, జర్నలిస్టులకు ఇండ్ల తాళాలు అప్పగించాలని డిమాండ్ చేశారు.
స్వరాష్ట్ర సాధన చేయు ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని తెలిపారు. నీ విషయాలను పరిగణలోకి తీసుకొని జర్నలిస్టులకు మేలు చేయాలని సంకల్పంతోనే గత ప్రభుత్వం ఇండ్ల పట్టాలను ఇచ్చిందని తెలిపారు. జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం, అధికారులు దిగి వచ్చే వరకు జర్నలిస్ట్ ల పక్షాన పోరాటం చేస్తామన్నారు. టీడబ్ల్యూజే ఎఫ్ రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీనివాస్ గౌడ్ హయాంలో వేల డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణంతో నాలుగు చిన్న నగరాలను సృష్టించారారని తెలిపారు. గతంలో జర్నలిస్ట్ లకు డుబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన ఇప్పటికి తాళాలు ఇవ్వడం లేదని చెప్పారు. దీక్షలో ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, జర్నలిస్టు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.