31-05-2025 11:24:10 PM
నాగారం: నాగారం మండల పరిధిలోని పేరబోయిన గూడెం బిక్కెరు వాగు నుండి సాండ్ పర్మిషన్ ఉన్న చోటు కాకుండా మరో చోటు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అరికట్టాలని శనివారం తహసిల్దార్ హరి కిషోర్ శర్మ(Tehsildar Hari Kishore Sharma)కు పేర బోయినగూడెం గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మన ఊరు మన ఇసుక పాలసీ అనుమతి ఉన్నచోటును శాండ్రీచ్ ఆఫీసర్ గుర్తించి ఇసుకను తరలించారు.
కానీ అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఆర్ఓ మామూళ్ల మత్తులో మునుగుతో అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్నారని వారు ఆరోపించారు. జిల్లా ఉన్నతమైన అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో జి. లక్ష్మయ్య వేల్పుల రమేష్ పి నాగరాజు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.