గ్రామ అభివృద్ధి పనులకు తీర్మానం
02-03-2026 05:40 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని జనగాం గ్రామంలో సోమవారం సర్పంచ్ దర్వాయి మధుబాయి శ్రీకాంత్ అధ్యక్షుతన గ్రామ పంచాయతీ గ్రామ సభ నిర్వహించారు.ఈ ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు తీర్మానం చేశారు. ఉపాధి హామీ పనిని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో మురికి కాల్వల నిర్వాహన, పారిశుధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వాడు సభ్యులు శ్యామ్ రావు సాయవ్వ శ్రీకాంత్ కవిత,ప్రణీత్, శ్రీకాంత్,రమేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




